మా అనుబంధ వెబ్సైట్...
|
న్యాయ వ్యవస్థ
భారత దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ఇది హైకోర్టులపై నియంత్రణాధికారం కల్గిఉన్నది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహాపైననే రాష్ట్రపతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను, ఇతర న్యాయమూర్తులను నియమిస్తాడు. ఇందులో 26 మంది జడ్జీలు ఉంటారు ప్రధాన న్యాయ మూర్తితో కలిపి. ఈ కోర్టులలో
లేక
లేక
ఇందులో సివిల్ కేసు అయినా, క్రిమినల్ కేసు అయినా, ఇతర ఏ కేసు అయినా హైకోర్టులో జరుగుతూ ఉన్నా, ఆఖరి తీర్పు అయిపోయినా మనము ఈ కోర్టులో (న్యాయస్థానంలో) ఫిర్యాదు చేసుకోవచ్చు.
సుప్రీం కోర్టు న్యాయమూర్తి పదవీ అర్హతలు:
రాష్ట్రంలో అత్యున్నత స్థానంలో ఉన్నది హైకోర్టు. ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంటుంది. రెండు లేక అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కూడా ఒకే హైకోర్టు ఉండేటట్లు పార్లమెంటు చట్టం చేయవచ్చు. మొత్తం భారతదేశంలో 21 హైకోర్టులు ఉన్నాయి. ఒక్కొక్క హైకోర్టులో ఒక్కొక ప్రధాన న్యాయమూర్తి ఉంటాడు. ఈ న్యాయమూర్తిని ప్రెసిడెంట్ నియమిస్తాడు సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర గవర్నర్ను సంప్రదించి. రాష్ట్రంలో ఏ ఇతర కోర్టులలో జరిగిన కేసుల పై న్యాయ విచారణ కోసం హైకోర్ట్ను సంప్రదించవచ్చు.
హైకోర్టు న్యాయ మూర్తి పదవీ అర్హతలు:
దేశం మొత్తంలో సబార్డినేట్ కోర్టులనేవి ఒకేలా ఉంటాయి. వాటికి ఉన్న అధికారంలో ఏ సివిల్ కేసునైన, క్రిమినల్ కేసునైన తీర్చగలదు.
ఈ మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులలో ఫ్యాక్టరీల వివాదాలు, కార్మిక చట్టాలకు సంబంధించిన వివాదాలపై కేసులు పరిష్కారం జరుగుతుంది.
ఫ్యామిలి కోర్టులలో వివాహ సంబంధ సమస్యలు, కుటుంబాలకు సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తాయి. ఈ కోర్టులను ఏ పట్టణంలోనైన ఉండవచ్చు, ఎక్కడైన ఉండవచ్చు. ప్రస్తుతానికి మన భారతదేశంలో 153 ఫ్యామిలి కోర్టులు ఉన్నాయి.
వివిధ పెండింగ్ కేసుల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటుచేసింది.